News

GHMC కార్మికులతో చర్చలు విఫలమయ్యాయి


మునిసిపల్ కార్మికులతో తెలంగాణ మంత్రి నాయిని నరసింహారెడ్డి, జిహెచ్ఎంసి కమిషనర్ సోమేష్ కుమార్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో తమ సమ్మెను కొనసాగిస్తామని కార్మిక సంఘాల నాయకులు చెప్పారు. చర్చలకు పిలిచిన ప్రభుత్వం తమ డిమాండ్లపై ఎటువంటి హామీ ఇవ్వకుండానే సమ్మెను విరమించమని కోరిందని కార్మిక సంఘాల నాయకులు చర్చల అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. రంజాన్ మాసం, పుష్కరాలు ఉన్నందున సమ్మెను విరమించాలని కోరుతున్న ప్రభుత్వం తమ డిమాండ్లపై మాత్రం ఏ హామీ ఇవ్వలేదని వారు పేర్కొంన్నారు. చర్చల అనంతరం నాయిని విలేకరులతో మాట్లాడుతూ సిఎంతో మాట్లాడి నిర్ణయం చెుబుతామని నాయిని అన్నారు.